అన్వేష్‌ను ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి: తిరుపతి ఎస్పీకి హిందూ సంఘాల ఫిర్యాదు


అన్వేష్ను ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి తిరుపతి ఎస్పీకి హిందూ సంఘాల ఫిర్యాదు

యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హిందువులు, హిందూ దేవుళ్ల గురించి అన్వేష్ చేసిన వివాదం నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్త్రీల వస్త్రధారణపై సినీనటుడు శివాజీ, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావులు చేసిన వ్యాఖ్యలపైనా అన్వేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గరికపాటి నరసింహారావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అన్వేష్. అయితే అన్వేష్ వ్యాఖ్యలకు మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుంది గరికపాటి నరసింహారావు అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో అన్వేష్‌పై హిందూ సంఘాలు తిరుపతి ఎస్పీ,ఏఎస్పీకి ఫిర్యాదు చేశాయి.

అన్వేష్‌పై పోలీసులకు ఫిర్యాదు

యూట్యూబర్ అన్వేష్‌పై తిరుపతిలోని హిందూ సంఘాలన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హిందూ దేవుళ్లు, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నా అన్వేష్ యూ ట్యూబ్ ఛానెల్ అన్వేష్‌పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో పలు హిందూ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. హిందూ దేవి,దేవతల గురించి అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్ నాఅన్వేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నాయకులు బత్తల మధుబాబు, కిరణ్, కిరీటిలు తిరుపతి ఎస్పీ, ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.

హిందువులకు అన్వేష్ క్షమాపణలు చెప్పాలి

భారతీయుల భిక్షతో బతుకుతూ… హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అన్వేష్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని హిందూ సంఘాల నాయకులు ఉన్నారు.ఆధ్యాత్మిక గురువు గరికపాటి నరసింహారావు గురించి అసభ్య పదజాలంతో మాట్లాడిన అన్వేషణ భారత దేశానికి తీసుకొచ్చి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని సూచించారు. తక్షణమే నా అన్వేష్ భారతీయులకు, హిందువులకు క్షమాపణలు చెప్పాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. భారతదేశంలోని మహిళకు భద్రత లేదంటూ తనకు కూతురు పుడితే భారత్‌లో ఉంచబోను అంటూ చేసిన వ్యాఖ్యలపై సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.అలాగే భారతీయులు నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్‌ను తిరస్కరించాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈసడించుకుంటే మాత్రం పది రోజుల్లో మారతాడు: గరికపాటి నరసింహారావు

ప్రముఖ ప్రవచనకర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్‌ను యూట్యూబర్ అన్వేష్ ఖండించిన సంగతి తెలిసిందే. ఖండించడంతోపాటు గరికపాటిని బండ బూతులు తిట్టాడు. అంతేకాదు మహిళలు తమకు నచ్చినట్టు దుస్తులు వేసుకో చెప్పుకొచ్చాడు. అయితే ఇన్నిరోజులు అన్వేష్‌కు కౌంటర్ ఇవ్వని గరికపాటి నరసింహారావు తాజాగా స్పందించారు. అన్వేష్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.’ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు. కానీ పది మంది కలిసి అతడిని ఈసడించుకుంటే మాత్రం పది రోజుల్లో మారతాడు’ అంటూ గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు చేశారు. ‘సమాజంలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం ఉండాలి. అవసరమైతే ముఖం మీదే తప్పు అని చెప్పగలగాలి. ఎలాంటి తప్పు చేయని వారిపై కూడా బురద జల్లుతూ, వ్యక్తిత్వ నాశనానికి పాల్పడుతున్నారు’అంటూ గరికపాటి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వాన్ని కూనీ చేసేలా కొందరు మాట్లాడుతున్న…సహిస్తూ ఉంటే రెచ్చిపోయారని గరికపాటి. కానీ తనపై కామెంట్స్ చేస్తే అభిమానులు మాత్రం సహించలేరు…శత్రులకు గట్టిగా బుద్ధి చెబుతున్నారని. సోషల్ మీడియా కామెంట్లలోనూ తమదే పైచేయి అని గరికపాటి నరసింహారావు చెప్పుకొచ్చారు.



Source link

Spread the love