ఇండియా ఇరాన్ ట్రావెల్ అడ్వైజరీ,ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికలు – మాకు దాడి నిరసనలు వ్యాపించే ముప్పు మధ్య ఇరాన్ ఇండియాకు పూర్తి సలహా ఇవ్వండి


ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, అమెరికా సైనిక దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రత కోసం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలో గంటగంటకూ మారుత పరిస్థితి.. అక్కడ ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఇరాన్
భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికలు(ఫోటోలు– సమయం తెలుగు)
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఇరాన్‌లో ఉన్న పౌరులను తక్షణమే దేశం విడిచి రావాలని భారత్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ అంతటా చెలరేగుతున్న నిరసనలు.. అమెరికా దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత రాయబార కార్యాలయం లీవ్ ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, అక్కడ ఉన్న విమాన సర్వీసులు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.

నోటీసు ఇచ్చే వరకు భారతీయులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టెహ్రాన్‌లోని భారత ఎంబాసీ అత్యవసర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై హింసను ఆపకపోతే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని.. సహాయం అందుతుంది అని ట్రంప్ ప్రకటించారు.

ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి బీ-52 బాంబర్లు, కేసీ-135 ట్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు నివేదికలు అందజేస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. భద్రతా సైనిక కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 2,500 మంది మరణించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇరాన్‌లో ప్రస్తుతం 180కి పైగా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిరసనకారులకు మరణశిక్షలు అమలు కావడం ఇరాన్ న్యాయశాఖ ఇప్పటికే ప్రకటించడంతో.. ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి