ఇండియా టుడే సీవోటర్ సర్వే 2026 ఏపీలో టీడీపీ కూటమి గెలుపును అంచనా వేసింది


ఆంధ్ర ప్రదేశ్ ఇండియా టుడే CVoter సర్వే 2026: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?. ఇండియా టుడే సీ ఓటర్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కూటమికి ఓటు శాతం పెరుగుతుందని.. వైఎస్సార్సీపీకి తగ్గుతుందని సర్వే చెబుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోగా.. బీజేపీకి తగ్గింది.. బీఆర్ఎస్ కాస్త పుంజుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే.. బీజేపీకి మెజారిటీ వస్తుందని సర్వే చెబుతోంది.

హైలైట్:

  • ఇండియా టుడే సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్
  • ఏపీలో పరిస్థితులపై సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా
ఇండియా టుడే సి ఓటర్ సర్వే 2026
ఇండియా టుడే సీఓటర్ సర్వే 2026(ఫోటోలు– సమయం తెలుగు)
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది.. జూన్ నాటికి రెండేళ్లు పూర్తికాబోతోంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి పట్టం కడతారు. మళ్లీ అధికారాన్ని దక్కించుకుందా.. వైఎస్సార్సీపీ మళ్లీ పుంజుకుంటుందా.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపై తాజాగా ఓ సర్వే జరిగింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందనే అంచనాలతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎన్వోటీఎన్) సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా దేశంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే ద్వారా అంచనా వేస్తోంది. అలాగే రాష్ట్రాల వారిగా కూడా సర్వే ఫలితాలను విడుదల చేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సర్వే కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.. వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 25 ఎంపీల్లో టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకు 2 దక్కాయి.. వైఎస్సార్సీపీ 4 ఎంపీలను గెలుచుకుంది.
తాజాగా ఇండియా టుడే ఓటర్ సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (NDA) ఓటు శాతం 53 శాతం నుంచి 55 శాతం పెరిగింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే కూటమికి 22 నుంచి 24 సీట్లు వస్తాయని అంచనా వేశారు. వైఎస్సార్సీపీ ఓటు శాతం 40 నుంచి 39కు పడిపోయింది.. 1 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతరులు కలిపి 6 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను బట్టి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సానుకూలంగానే ఉన్నారనే చర్చ. ఎందుకంటే బలంగా ఉండటంతో పాటుగా ప్రభుత్వ పథకాలతో ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీకి మాత్రం ఒక్క శాతం ఓటు షేర్ పడిపోతుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్సీపీకి మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి.
ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. ఇకపై మూడు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!
తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఫలితాల ప్రకారం.. తెలంగాణలో అంచనాలను కూడా కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2024లో 40.1 శాతం ఓట్ షేర్ వచ్చింది.. ఇప్పుడు అది 41 శాతం పెరిగిందని సర్వే ద్వారా తెలుస్తోంది. బీజేపీకి 2024లో 35 శాతం ఉండగా.. ఇప్పుడు 33శాతానికి తగ్గిందంటున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. 2024లో 16.6 శాతం రాగా.. 18శాతానికి పెరిగిందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పెరిగింది.. బీజేపీకి తగ్గింది, బీఆర్ఎస్‌కు 1.5 శాతం పెరిగింది.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెబుతోంది. ఎన్డీయే ఏకంగా 352 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు.. ఇందులో బీజేపీకి సొంతంగా 287 సీట్లు వస్తాయని.. ఇండీ కూటమికి 182 స్థానాలు పరిమితం అవుతాయని.. కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు దక్కుతాయని సర్వేలో తేలిందంటున్నారు.
తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్‌డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న తిరుమల బాబుకు అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి