మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) – 2026 మెగా వేలం ఢిల్లీలో మొదలైంది. దేశమంతా ఉన్న యువ ప్రతిభకు ఈ లీగ్ వేదికగా నిలుస్తోంది. ఈ సారి కూడా 142 మంది అన్క్యాప్ట్ భారత క్రికెటర్లు ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైష్ణవి శర్మ, దీయా యాదవ్, మమత మడివాళ, తనీషా సింగ్, జి త్రిష వంటి ప్రతిభావంతులపై భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది. ఫ్రాంఛైజీలు కూడా పోటీపడే అవకాశం ఉంది.
హైలైట్:
- నేటి నుంచి డబ్ల్యూపీఎల్ వేలం
- వేలంలో 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు
- ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం

వైష్ణవి శర్మ
భారత్ అండర్ – 19 ప్రపంచకప్లో హ్యాట్రిక్ తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచిన వైష్ణవి శర్మ ప్రస్తుతం స్కౌట్స్ దృష్టిలో నిలిచిన ప్రధాన స్పిన్నర్. బేస్ ప్రైజ్ రూ. 10 లక్షలతో వేలంలోకి వచ్చింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో 11 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టింది. ఇంటర్ జోన్లో ఐదు మ్యాచ్లలో 12 వికెట్లు తీసుకున్నారు. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్లకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో భారీ డిమాండ్ ఉండటంతో ఆమెపై బిడ్డింగ్ వార్ కచ్చితంగా కనిపించనుంది.
దియా యాదవ్
హర్యానాకు చెందిన దీయా యాదవ్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలతో వేలానికి వచ్చింది. ఈ సీజన్లో సీనియర్ మహిళల టీ20లో అద్భుత ఫామ్ చూపెట్టింది 128 స్ట్రయిక్ రేట్, 59.5 యావరేజ్తో 298 పరుగులు చేసింది. ఇంటర్ జోన్లో 151 పరుగులు చేసింది. మూడు అర్ధ సెంచరీలు చేసిన ఈ బ్యాటర్ షఫాలి వర్మ స్టయిల్ను ఫాలో అవుతూ అగ్రెసివ్ బ్యాటింగ్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
మమత మడివాళ
హైదరాబాద్ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్న మమత మడివాళ రూ. 10 లక్షల బేస్ ప్రైజ్లోకి వేలంలోకి వచ్చింది. ఇండియా ఏ డెబ్యూ మ్యాచ్లో 60 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్గా నిలిచింది. 2025 మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. వికెట్కీపర్ బ్యాటర్లకు డబ్ల్యూపీఎల్లో భారీ డిమాండ్ ఉండటంతో మమతను పలు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
తనీషా సింగ్
ఢిల్లీకి చెందిన ఆల్రౌండర్ తనీషా సింగ్ 2025 డీపీఎల్లో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’గా నిలిచింది. ఆఫ్ స్పిన్, అగ్రేసివ్ బ్యాటింగ్తో బెస్ట్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. అండర్ – 23 టీ20 ట్రోఫీలో ఢిల్లీకి కెప్టెన్గా టైటిల్ అందించింది. ఆల్రౌండర్ అయిన ప్రతి జట్టు ఆమెను దక్కించుకోవడానికి ప్రయత్నించొచ్చు.
జి త్రిష
ఇప్పటివరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అమ్ముడుపోనప్పటికీ, ఈసారి త్రిషకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండర్ 19 ప్రపంచకప్ 2025లో 309 రన్స్తో పాటు 9 వికెట్లు కూడా తీసుకుంది. ఫైనల్లో 4 పరుగులు, మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో 147 రన్స్తో మంచి ఫామ్లో ఉంది.
