
ఇంటర్నెట్డెస్క్: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిరిండియా (ఎయిర్ ఇండియా) విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరణించిన ప్రధాన పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేంద్రం, డీజీసీఏలకు నోటీసులు జారీ చేసింది.
ఎయిరిండియా (ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్)లో మరణించిన 260 మందిలో కెప్టెన్ సుమీత్, కో-పైలట్ క్లైవ్ కుందర్లు కూడా ఉన్నారు. ఈ కేసును న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ.. సుమీత్ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధరించడంతోపాటు ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. మీ కుమారుడిని నిందిస్తున్న భారాన్ని మీరు మోయకూడదు. అతడిని ఎవరూ నిందించలేరు. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదు. ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదు. ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే బయటకు వచ్చింది.
ఈ కోరుతూనే పిటిషన్పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబరు 10కి వాయిదా వేసింది.