కోల్ ఇండియా సబ్సిడియరీ Cmpdi Ipo,ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం ‘కోల్ ఇండియా’ సహా 3 కంపెనీల IPOలు.. మరో లిస్టింగులు – రాబోయే ipos coal india subsidiary cmpdi మధ్య 3 ipos షెడ్యూల్డ్ ఈ వారం


IPO క్యాలెండర్: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం పండగే. ఎందుకంటే కోల్ ఇండియా అనుబంధ సంస్థ సహా మరో 2 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. అలాగే మరో 3 కంపెనీల స్టాక్స్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. మరి ఏ కంపెనీ ఎప్పుడు వస్తోంది? ఐపీఓ సైజ్ ఎంత అనేది తెలుసుకుందాం.

IPO
IPO(ఫోటోలు– ఎకనామిక్ టైమ్స్)
IPO క్యాలెండర్: దేశీయ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా మూడు ఇండియన్ ప్రైమరీ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్ సెక్టార్ నుంచి వస్తున్నాయి. వీటికి అదనంగా మూడు కంపెనీల స్టాక్స్ ఈ వారమే మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగి మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలాంటి పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. మరి ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

జీఎస్‌పీ క్రాప్ సైన్స్ ఐపీఓ

ఈ వారం అతిపెద్ద ఐపీఓగా ఆగ్రోకెమికల్ తయారీ కంపెనీ జీఎస్‌పీ క్రాప్ సైన్స్ (GST క్రాప్ సైన్స్) ఉంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి రూ.400 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం మార్చి 16వ తేదీన వస్తుండగా మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ.304 నుంచి రూ.320గా నిర్ణయించారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.240 కోట్ల విలువైన షేర్లు, రూ.160 కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సెల్ ద్వారా విక్రయిస్తోంది. కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాలి.

సీఎంపీడీఐ ఐపీఓ

మెయిన్ బోర్డ్ నుంచి వస్తున్న రెండో కంపెనీ సీఎంపీడీఐ (CMPDI) అనే కంపెనీ ఐపీఓకు వస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీ అయిన కోల్ ఇండియా అనుబంధ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఇది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మార్చి 20వ తేదీన ప్రారంభమవుతుండగా మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతుంది. పూర్తి ఆఫర్ ఫర్ సెల్ ద్వారా 10.71 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ప్రభుత్వం, కోల్ ఇండియా కంపెనీలు తమ వాటాను విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మార్చి 30న లిస్టింగ్ కంపెనీ.

నోవస్ లాయల్టీ లిమిటెడ్

మెయిన్ బోర్డుతో సహా ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి ఓ కంపెనీ ఈ వారం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. అదే నోవస్ లాయల్టీ లిమిటెడ్ (నోవస్ లాయల్టీ లిమిటెడ్). ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మార్చి 17వ తేదీన ప్రారంభమవుతుండగా మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రైస్ బ్యాండ్ రూ.139 నుంచి రూ.146గా నిర్ణయించారు. మొత్తం రూ.60.15 కోట్లు సమీకరించనుంది.

3 కంపెనీల జాబితాలు

ఈ వారం మూడు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో జాబితా కానున్నాయి. అందులో రాజ్‌పుతన స్టెయన్ లెస్, అప్సిస్ ఏరోకామ్, రాజ్‌మార్క్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కంపెనీలు ఉన్నాయి. మార్కెట్‌లో ప్రస్తుత ప్రాఫిట్‌లో జాబితా మార్కెట్ సెంటిమెంటును కొనసాగిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బండ తిరుపతి

రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బిజినెస్‌ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రభుత్వ పథకాలు, పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్‌లు, బంగారం వెండి ధరలపై అప్‌డేట్లు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తిరుపతి.. ప్రముఖ జర్నలిజం స్కూల్ ఈజేఎస్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో బండ తిరుపతి టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ అందుకున్నారు.… ఇంకా చదవండి