టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు,ఇండియాలో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే.. మారుతీ నుంచి ఆరు.. టాటానే టాప్.. అక్టోబర్ లిస్ట్ ఇదే.. – అక్టోబర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లు టాటా నెక్సాన్ ఇక్కడ అగ్రస్థానంలో నిలిచింది.


టాటా నెక్సన్ బెస్ట్ సెల్లింగ్ కార్: ఇటీవలి కాలంలో కార్లు కొనుగోలు చేస్తే వారి సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. అవసరాలు పెరగడం సహా ఇదే సమయంలో జీఎస్టీ రేట్ల కోత కలిసొచ్చింది. ఆయా కంపెనీలు భారీగా రేట్లను తగ్గించాయి. ఇంకా దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో.. ఇతర డిస్కౌంట్లు ఉండటంతో అక్టోబర్ నెలలో కొనుగోళ్లు పెరిగాయి. ఇక ఇప్పుడు అక్టోబర్ నెలలో ఎక్కువగా అమ్ముడుబోయిన కార్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లు
ఇండియాలో ఎక్కువగా అమ్ముడైన కారు(ఫోటోలు– ఎకనామిక్ టైమ్స్)
Maruti Suzuki Cars : కార్ల అమ్మకాల్లో అక్టోబర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. పండగ సీజన్‌లో సాధారణంగా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించడం కూడా కలిసొచ్చింది. చిన్న కార్లపై జీఎస్టీ రేట్లు 28 శాతం నుంచి 18 శాతం తగ్గడం, సెస్ తొలగించడం సహా పండగ సీజన్‌లో కార్ల తయారీ కంపెనీలు అదనపు డిస్కౌంట్లు ప్రకటించడంతో రేట్లు భారీగా దిగొచ్చాయి. దాదాపు అన్ని కంపెనీలు కూడా అక్టోబర్ నెలలో గత సంవత్సరం ఇదే సమయంతో ప్రస్తుత వాహనాల విక్రయాల్లో వృద్ధి కనబరిచింది. టాటా మోటార్స్ విక్రయాల్లో 27 శాతం వృద్ధి కనిపించింది.. ఇదే మారుతీ సుజుకీ విక్రయాలు 7 శాతం పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 26 శాతం విక్రయాల్ని పెంచుకుంది. హ్యుందాయ్, టయోటా, కియా.. ఏకంగా 30 శాతంపైగా వృద్ధిని కనబరిచాయి.

జీఎస్టీ రేట్ల కోటతో ప్రధానంగా.. చిన్న కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే సమయంలో సబ్ కాంపాక్ట్ SUV విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు మనం అక్టోబరు నెలలో అత్యధికంగా అమ్ముడుబోయిన టాప్- 10 కార్లు ఏంటి.. ఎన్ని విక్రయాలు నమోదు చేసిందనే దాని గురించి చూద్దాం. ఈ లిస్టులో మారుతీ సుజుకీ 6 మోడల్స్ ఉండగా.. టాటా మోటార్స్ మాత్రం టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా అంటే ఇప్పటివరకు మారుతీ ఆల్టో టాప్‌లో ఉంటుందని చెప్పొచ్చు.

2025 అక్టోబర్ నెలలో టాటా నెక్సాన్ ఏకంగా 22,083 యూనిట్లను విక్రయించి టాప్ ప్లేస్‌లో ఉంది. 2024 అక్టోబరులో ఈ సంఖ్య 14,759 ఉండగా.. వృద్ధి 50 శాతంగా ఉంది. మారుతీ సుజుకీ డిజైర్ 20,791 విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. ఇది 64 శాతం వృద్ధి నమోదు చేసింది. మారుతీ సుజుకీ ఎర్టిగా 20,087 కార్లను విక్రయించి టాప్-3లో నిలిచింది. 18,970 కార్లను విక్రయించిన మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ నాలుగో స్థానంలో ఉండగా.. హ్యుందాయ్ క్రెటా (క్రెటా N లైన్ + క్రెటా ev) 18,381 విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది.
>> మహీంద్రా స్కార్పియో (స్కార్పియో క్లాసిక్ + స్కార్పియో N) 17,880 విక్రయాలతో ఆరో స్థానంలో నిలిచింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (17,003), మారుతీ సుజుకీ బాలెనో (16,873), టాటా పంచ్ (ICE+EV- 16,810), మారుతీ సుజుకీ స్విఫ్ట్ (15,542) తర్వాత వరుసగా ఉన్నాయి. టాప్-10లో స్విఫ్ట్ విక్రయాలు మాత్రమే అంతకుముందు ఏడాది ఇదే సమయంతో చూస్తే.. 11 శాతం తగ్గాయి.

పూర్ణచందర్ తూనం

రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బిజినెస్‌ రంగానికి సంబంధించిన తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ న్యూస్, బంగారం వెండి ధరలపై తాజా అప్‌డేట్లు అందజేస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ భారత్ సంస్థలో బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. పూర్ణచందర్ ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. పూర్ణచందర్ 2025 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఏబీసీడీ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి