
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనాస్థలంలో భయానక దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ఆ పేలుడు (ఢిల్లీ బ్లాస్ట్) తీవ్రత ఎంతలా ఉందంటే.. మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలు కొన్ని వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. తాజాగా లజపతిరాయ్ మార్కెట్లోని ఓ దుకాణంపై తెగిపడిన దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఎర్రకోట (రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్) కారిడార్కు ఎదురుగా ఉన్న ఈ దుకాణం.. పేలుడు దాదాపు 100 అడుగుల (300 మీటర్లు) దూరంలో ఉంది. ఈ దుకాణం పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోసిక్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ పరీక్షలతో ఈ శరీర భాగాల్లో ఎవరిదో గుర్తించనున్నారు.
ఇక, ఈ పేలుడులో తయారు చేసిన వారి శరీరాలకు పోస్ట్మార్టం జరిగింది. చాలా మృతదేహాలపై బలమైన దెబ్బలు తగిలిన గాయాలున్నట్లు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు వారు ఎగిరి సమీపంలోని గోడకు లేదా నేలపై బలంగా పడిపోయి ఉంటారని ఫోరెన్సిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, మృతుల్లో చాలామందికి ఊపిరితిత్తులు, చెవులు, ఉదరభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక.
ఈ ఘటనకు అధిక సంఖ్యలో పేలుడు పదార్థాలను వినియోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు గుర్తించారు. ఘటనాస్థలం దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, రెండు రకాల పేలుడు పదార్థాలు ఉన్నాయి. అందులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ను పోలినట్లుగా. రెండోది దీనికంటే శక్తిమంతమైనది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య 13కు పెరిగినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు.