హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా జీహెచ్ఎంసీ (GHMC), జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికల నిర్వహణపై కీలక చర్చ జరగనుంది.
అలాగే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను ఎల్ అండ్ టీ (L&T) నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు రైతులకు ‘రైతు భరోసా’ నిధుల విడుదల, వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.