తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సభలో ప్రవేశపెట్టాల్సిన మూడు ముఖ్య బిల్లులపై కేబినెట్ సభ్యులు సమగ్రంగా చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో సుమారు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లులో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోర్ అర్బన్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుపై కూడా కేబినెట్లో చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే
మరిన్ని కోసం తాజా వార్తలు
నవీకరించబడిన తేదీ – మార్చి 23, 2026 | 08:38 PM