జామ్నగర్ (గుజరాత్): అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిని దాటి భారత్కు రెండో ప్రధాన నౌకగా ‘నందా దేవి’ నిలిచింది. 46,500 మెట్రిక్ టన్నుల పెట్రోలియం గ్యాస్ (LPG) లోడ్తో ఉన్న ఈ భారత ఎల్పీజీ క్యారియర్, గుజరాత్లోని జామ్నగర్ వడినార్ పోర్టుకు మంగళవారం సురక్షితంగా చేరుకుంది.
అన్ని గ్యాస్ పంపిణీ
నౌకలో ఉన్న భారీ గ్యాస్ నిల్వలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు:
ముంద్రా పోర్టు: మొత్తం నిల్వల నుంచి 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని ముంద్రాకు తరలిస్తున్నారు.
మంగళూరు పోర్టు: మిగిలిన 26,500 మెట్రిక్ టన్నుల గ్యాస్ను కర్ణాటకలోని మంగళూరుకు తరలించనున్నారు.
సిబ్బందికి అభినందనలు
నౌక సురక్షితంగా తీరానికి చేరుకున్న సందర్భంగా ‘నందా దేవి’ షిప్ కెప్టెన్ మరియు సిబ్బందితో మాట్లాడారు. ఉద్రిక్తతలు ఉన్న జలసంధి గుండ క్షేమంగా నౌకను నడిపించినందుకు వారిని అభినందించారు. దేశ ఇంధన అవసరాల దృష్ట్యా ఈ ఎల్పీజీ రవాణా ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.