భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
దేశానికి వెన్నెముకైన అన్నదాతలకు వాతావరణ శాఖ నుంచి ఒక కీలక హెచ్చరిక వెలువడింది. ఈ వర్షాల మీద ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ (స్కైమెట్) మిశ్రమ వార్తను అందించింది. 2026 నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి
భారత వ్యవసాయ రంగాన్ని శాసించే నైరుతి రుతుపవనాలపై ‘స్కైమెట్’ వెదర్ అంచనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది దీర్ఘకాల సగటు (LPA)లో కేవలం 90 నుంచి 95 శాతం వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉంది. అంటే, ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, ఇది ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకీ విపత్తు? ‘ఎల్ నినో’ సెగ!
రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం ‘ఎల్ నినో’ ప్రభావమేనని స్కైమెట్ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, భారత ఉపఖండంలో వర్షాలను తగ్గిస్తుంది. రుతుపవనాల ప్రారంభ దశలో ఇది మొదలై, ఏడాది చివర వరకు మరింత బలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా, సెప్టెంబరు నెలల్లో వర్షాలు అస్తవ్యస్తంగా ఉండవచ్చని అంచనా.
నెలల వారీగా వర్షపాత అంచనాలు:
రైతులు తమ పంట ప్రణాళికను సిద్ధం చేయాలనుకుంటున్నారు
- జూన్: 101% (ప్రారంభం ఆశాజనకంగా ఉంటుంది).
- జూలై: 95% (సాధారణ స్థాయికి చేరువలో).
- ఆగస్టు: 92% (తగ్గుముఖం పట్టే అవకాశం).
- సెప్టెంబర్: 89% (అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం).
రెండో భాగంలో గండం..
రుతుపవన కాలం మొదటి సగం (జూన్, జూలై) ఓ మోస్తరుగా రెండో సగం (ఆగస్టు, సెప్టెంబర్) మాత్రం రైతులను ఇబ్బంది పెట్టేలా ఉంది. వర్షపాతం పంపిణీ అసమానంగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల పొడి వాతావరణం నెలకొనవచ్చు. అయితే, భారత మహాసముద్ర డోలనం (IOD) సానుకూలంగా ఉంటే, ఎల్నినో ప్రభావం ఇది కొంతవరకు అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున, అన్నదాతలు నీటి లభ్యతను తక్కువ నీటితో పండే పంటలను బట్టి ఉత్తమం. జూన్లో వర్షాలు ఆరంభంలో బాగుంటాయని అంచనా వేస్తున్నందున, విత్తనాలు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతానికి ఇవి ప్రైవేట్ సంస్థ అంచనాలు మాత్రమే. భారత అధికారిక వాతావరణ శాఖ (IMD) తన నివేదికను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పుడు అందరి కళ్లు దానిపైనే ఉన్నాయి.