భారత్ – పాకిస్థాన్: అవన్నీ తప్పుడు ఆరోపణలే.. పాక్‌లో అంతర్గత అధికార దాహమే అందుకు కారణం: కేంద్రం


ఇంటర్నెట్ డెస్క్: ఇస్లామాబాద్ పేలుళ్లపై పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. తమ దేశంలో వరుస పేలుళ్ల వెనుక భారత్‌ ఉందని పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఉత్పత్తులు. ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. పాక్‌లో అంతర్గత అధికార దాహమే దానికి కారణమంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధిర్ జైస్వాల్ స్పందించారు. పొరుగు దేశంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి వెనుక భారత్‌ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి వాటిని భారత్ ప్రోత్సహించదని చెప్పారు.

”పాకిస్థాన్‌ నాయకత్వం చేస్తోన్న నిరాధార, అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దేశంలో జరుగుతోన్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం, అధికార దోపిడీ నుంచి అక్కడి ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలను పాక్ కల్పిస్తుందని ఊహించదగినదే. అంతర్జాతీయంగా వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. పాక్ ఎన్ని వితండవాదనలు చేసినా ఎవరూ మోసపోరు” అని రణధిర్

పెను ప్రమాదం తప్పిందా..?

సోమవారం భారత రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్ల ఘటన వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్ర సంస్థ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దేశమంతా ముమ్మరంగా తనిఖీలు జరిగాయి. అయితే, ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఓ కీలక విషయం బయటకు వచ్చింది. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్తూ అనుమానితులు చేసిన పొరపాటుతోనే ఈ ఘటన జరిగినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఐఈడీలను సిద్ధం చేయాలని చేసిన తప్పిదంతో పేలుడు జరిగినట్లు. విచారణ అనంతరమే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.



Source link

Spread the love