- ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు..
- అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, వైఎస్ జగన్..
- షాపాలీ, దీప్తీ అద్భుత అద్భుత నటుడు ప్రత్యేకంగా నిలిచారు: డిప్యూటీ సీఎం

టీమ్ ఇండియా: వరల్డ్ కప్- 2025 సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 ను దక్కించుకున్న భారత జట్టు చరిత్ర సృష్టించింది.. ప్రతి ప్లేయర్ నైపుణ్యం, పట్టుదల, జట్టు ఆటతో 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా ప్రశంసించారు. షాఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే, దీప్తీ శర్మ బ్యాటింగ్, బౌలింగ్లో చూపించిన ఆల్రౌండ్ ప్రదర్శన జట్టుకి కీలకంగా మారింది.. ఈ ప్రపంచ కప్ విజయం భారత అమ్మాయిల్లో క్రీడలపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కొనియాడారు.
ఇది కూడా చదవండి: కాష్ పటేల్: ఆమె దేశభక్తురాలు.. జెట్లో వెళ్తే తప్పేంటి? సమర్థించుకున్న ఎఫ్బీఐ చీఫ్
ఇక, ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ (ట్వీటర్) వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో విజయం సాధించిందని తెలిపారు. వారు చూపిన అంకితభావం, ఆత్మవిశ్వాసం మొత్తం దేశాన్నే గర్వపడేలా చేశాయి.. కడపకు చెందిన శ్రీచరణి ఈ విజేత జట్టులో భాగం కావడం మరింత సంతోషకరం అన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత విజయాన్ని స్వర్ణ అధ్యాయంలో గుర్తుంచుకుంటారు.. ఈ విజయం ప్రతి భారత యువతికి పెద్ద కలలు కనడానికి ప్రేరణగా నిలుస్తుంది అని వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఇళయరాజా: 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్!
అలాగే, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన మ్యాచ్కి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల సత్తాను మన జట్టు ప్రపంచానికి చాటి చెప్పింది. తన బౌలింగ్ తో మేజిక్ చేసిన శ్రీచరణికి ఏసీఏ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను.. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను సాధించిన యువ మహిళ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మహిళ క్రికెట్ ను, మహిళ క్రీడాకారులకు ఏసీఏ ప్రోత్సాహం అందించారు అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
భారత మహిళల క్రికెట్కు చారిత్రాత్మక విజయం 🇮🇳
కెప్టెన్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు @ఇమ్హర్మన్ప్రీత్ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను గెలుచుకోవడానికి దక్షిణాఫ్రికాను ఓడించి చరిత్ర సృష్టించినందుకు. ప్రతి క్రీడాకారుడు అద్భుతమైన నైపుణ్యం, సంకల్పం మరియు… pic.twitter.com/8KF8TF5390
– డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ (@APDeputyCMO) నవంబర్ 2, 2025
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.
వారు చూపిన సమిష్టి కృషి, విశ్వాసం మరియు అభిరుచి యావత్ దేశం గర్వించేలా చేసింది.
శ్రీచరణి అనే కడప అమ్మాయిని చూడటం చాలా బాగుంది… pic.twitter.com/Cw1tdFdvB4– వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (@ysjagan) నవంబర్ 3, 2025