తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం మరోసారి చర్చకు వచ్చింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆగిపోవడానికి డీఎంకే బెదిరింపులే కారణమని టీవీకే నేత చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. తమ నేత విజయ్ ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిడికి లొంగిపోరని టీవీకే ప్రధాన కార్యదర్శి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై రజినీ స్పందించారు. అన్ని ప్రశ్నలకు కాలమే తగిన సమాధానం చెబుతుందని ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
హైలైట్:
- రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై 2020లో జోరుగా ప్రచారం
- అనారోగ్య కారణాలతో వెనక్కి తగ్గినట్లు సూపర్స్టార్ ప్రకటన
- టీవీకే ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం

కాగా, గత తమిళనాడు ఎన్నికలకు ముందు రజినీ రాజకీయ అరంగేట్రంపై ముమ్మర ప్రచారం జరిగింది. ‘రజనీ మక్కళ్ మండ్రం’ అనే పేరుతో తలైవా పార్టీ ఏర్పాటుచేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహగానాలన్నింటికీ 2020లో రజినీ ముగింపు పలికారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. రజినీపై టీవీకే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే సమయంలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తులకు దాదాపు మూసుకుపోయాయి. సూపర్స్టార్ రజనీకాంత్పై టీవీకే నేతలు చేసిన వ్యాఖ్యల వివాదమే ఇందుకు కారణం. టీవీకేపై అన్నాడీఎంకే, బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొద్ది వారాలుగా టీవీకేతో పొత్తుల కోసం బీజేపీ తెరవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయ్కు డిప్యూటీ సీఎం పదవి, టీవీకేకు 80 సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిని టీవీకే తోసిపుచ్చింది.
తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్కడ డీఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి, అన్నాడీఎంకే-బీజేపీలతో కూడిన ఎన్డీయే, విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది.
