రజినీకాంత్,’డీఎంకే బెదిరింపులతోనే రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు’.. టీవీకే నేత వ్యాఖ్యలపై స్పందించిన సూపర్‌స్టార్ – tamil nadu elections super star rajinikanth strongly reacts on tvk leader comments about his political entry


తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం మరోసారి చర్చకు వచ్చింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆగిపోవడానికి డీఎంకే బెదిరింపులే కారణమని టీవీకే నేత చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. తమ నేత విజయ్ ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిడికి లొంగిపోరని టీవీకే ప్రధాన కార్యదర్శి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై రజినీ స్పందించారు. అన్ని ప్రశ్నలకు కాలమే తగిన సమాధానం చెబుతుందని ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

హైలైట్:

  • రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై 2020లో జోరుగా ప్రచారం
  • అనారోగ్య కారణాలతో వెనక్కి తగ్గినట్లు సూపర్‌స్టార్ ప్రకటన
  • టీవీకే ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం
రజనీకాంత్
రజినీకాంత్(ఫోటోలు– సమయం తెలుగు)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి నటుడు విజయ్ పార్టీ టీవీకే నేత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్.. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని తలైవా అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్‌ అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్న సమయంలో ఆయనపై డీఎంకే బెదిరింపులకు పాల్పడ్డారని, అందుకే వెనక్కి తగ్గారని తమిళ. అయితే, ఇలాంటి ఒత్తిళ్లకు తమ నాయకుడు విజయ్ తలొగ్గరని ఆదవ్.ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్‌ అభిమానులు, డీఎంకేతో పాటు అన్నాడీఎంకే సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదవ్ అర్జున్ వ్యాఖ్యలపై దక్షిణాది సీనియర్ నటుడు రజినీకాంత్ సూచనా.. ”టీవీకే ఉన్నతస్థాయి నేత నాపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు… కానీ, నేను చెప్పేది ఒక్కటే.. కాలం మాట్లాడలేకపోయింది కానీ, సరైన సమయంలో అందరికీ సమాధానం ఇస్తుంది” అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
కాగా, గత తమిళనాడు ఎన్నికలకు ముందు రజినీ రాజకీయ అరంగేట్రంపై ముమ్మర ప్రచారం జరిగింది. ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ అనే పేరుతో తలైవా పార్టీ ఏర్పాటుచేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహగానాలన్నింటికీ 2020లో రజినీ ముగింపు పలికారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.

త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. రజినీపై టీవీకే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే సమయంలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తులకు దాదాపు మూసుకుపోయాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై టీవీకే నేతలు చేసిన వ్యాఖ్యల వివాదమే ఇందుకు కారణం. టీవీకేపై అన్నాడీఎంకే, బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొద్ది వారాలుగా టీవీకేతో పొత్తుల కోసం బీజేపీ తెరవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి, టీవీకేకు 80 సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిని టీవీకే తోసిపుచ్చింది.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్కడ డీఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి, అన్నాడీఎంకే-బీజేపీలతో కూడిన ఎన్డీయే, విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్య వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి