తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం సిబ్బంది సంక్షేమం కోసం స్టేట్ బ్యా్ంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం టీజీఎస్సీఎఫ్ సిబ్బంది.. ప్రత్యేకంగా రూపొందించిన పోలీస్ శాలరీ ప్యాకేజీ అమలు చేస్తారు. తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం సిబ్బందికి వ్యక్తిగత బీమా సదుపాయాలు కల్పిస్తారు. వారికి ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండేలా ఆర్థిక సాయం అందిస్తారు. ఒప్పందంపై శనివారం రోజున టీజీఎస్పీఎఫ్, ఎస్బీఐ ప్రతినిధులు సంతకాలు చేశారు.

*విజయారెడ్డి ఆత్మహత్య కేసు.. పోలీస్ స్టేషన్కు సోదరుడు.. వారిపై కోర్టుకు!
ఒప్పందం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబసభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా కింద కోటి రూపాయలు అందిస్తారు. ఒకవేళ విమాన ప్రమాదాలలో మరణం సంభవిస్తే కోటీ 60 లక్షలు అందిస్తారు. శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో రూ.80 లక్షల వరకూ పరిహారంగా అందిస్తారు. టీజీఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ చనిపోతే.. వారి పిల్లల ఉన్నత విద్య కోసం 28 లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. అయితే18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇద్దరు కుమార్తెల వరకూ పెళ్లి కోసం పది లక్షల వరకూ అందిస్తారు. ఒకరికి అయితే ఐదు లక్షలు.. ఇద్దరు ఉంటే రూ.10 లక్షల వరకూ అందిస్తారు.
*మున్సిపల్ ఎన్నికల్లో మందు పంపిణీ చేయలేదని.. చేయి కోసుకున్న యువకుడు.. ఇలా తయారయ్యారేంట్రా!
అలాగే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షలు సౌకర్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదనపు ప్రయోజనాల కింద కాలిన గాయాల కేసుల్లో ప్లాస్టిక్ సర్జరీ కోసం గరిష్టంగా రూ.10 లక్షలు, విదేశీ మందుల రవాణా ఖర్చుల కోసం 5 లక్షల వరకూ చెల్లిస్తారు. అలాగే అంబులెన్స్ ఖర్చుల కింద గరిష్టంగా 50 వేలు అందిస్తారు.
*సూర్యాపేట: అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకిన అమ్మాయిలు.. అబ్బాయిలతో కలిసి..
ఎయిర్ అంబులెన్సు ఖర్చుల కింద 10 లక్షల వరకూ చెల్లిస్తారు. ప్రమాదం తర్వాత కోమాలో 48 గంటల కంటే ఎక్కువ ఉండి చనిపోతే.. ఐదు లక్షల వరకూ పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అదనంగా రుణ సౌకర్యాలు, లాకర్ అద్దెపై రాయితీలు, ఖాతాదారులకు ప్లాటినం రూపే డెబిట్ కార్డు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి
