

డాక్టరేట్ : బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపుపై పరిశోధన.. పుగలరసికి డాక్టరేట్..!
మదనపల్లి రూరల్, మన సాక్షి :
మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా కంప్యూటర్ సైన్స్) అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కె. పుగలరసి చెన్నైలోని అన్నా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ నుంచి డాక్టరేట్ పట్టా పొందినట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.
అన్నా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కే.సత్యవేల్ పర్యవేక్షణలో “ఇంప్రూవ్డ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ మరియు ఎవల్యూషనరీ ఆల్గోరిథం ఉపయోగించి బ్రె ట్యూమర్ గుర్తింపు మరియు వర్గీకరణ” అనే అంశంపై పరిశోధన చేసిన గాను పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా కె. పుగలరసిను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ , అధ్యాపకులు మరియు ఇతరుల అభినందనలు తెలియజేశారు.
ఎక్కువగా చదవబడినవి
నల్గొండ : ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపోల్స్లో తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారిగా వివరాలు ఇవీ..!
ఏసీబీ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!
నారాయణపేట : ఎర్రగుట్ట చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..!
