తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. తెలంగాణ నుంచి ఏకంగా 20 మంది అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి సివిల్స్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇక సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

యూపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ పరీక్షలు రాసే పేద అభ్యర్థులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయి.. మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సాయం చేస్తోంది. ఇక గతేడాది ఈ పథకం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం ఇచ్చింది. వారిలో 51 మంది ఫైనల్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ కాగా.. తాజాగా 20 మంది ఎంపికయ్యారు. ఈ అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగదును అందజేసింది.
ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో జనరల్ కేటగిరీ నుంచి 317 మంది ఎంపికయ్యారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 104, ఓబీసీ 306, ఎస్సీ 158, ఎస్టీ 73 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లు యూపీఎస్సీ తెలిపింది. సివిల్స్ పరీక్షల్లో అభ్యర్థుల మార్కులను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్స్ 2025కు ఎంపికైన వారు
- జశ్వంత్ చంద్ర – 23వ ర్యాంకు
- సృజన – 55వ ర్యాంకు
- భానోత్ లక్ష్మీ రచన – 178వ ర్యాంకు
- డీఎస్కే ప్రచేత్ – 193వ ర్యాంకు
- ఎస్ వర్షిత్ రెడ్డి – 259వ ర్యాంకు
- ఎం.పవన్కుమార్ రెడ్డి – 297వ ర్యాంకు
- వెలిమినేటి విక్రమసింహారెడ్డి – 541వ ర్యాంకు
- గుమ్మల శ్వేత – 573వ ర్యాంకు
- పల్లి ప్రమోద్ విష్ణు – 640వ ర్యాంకు
- గుమ్మల విజయసింహారెడ్డి – 682వ ర్యాంకు
- పోతుపురెడ్డి భార్గవ్ – 738వ ర్యాంకు
- పుడారి రాహుల్ – 748వ ర్యాంకు
- కుమ్మరి శ్రవణ్కుమార్ – 768వ ర్యాంకు
- అనిరుధ్ కత్తిమాని – 786వ ర్యాంకు
- కోరపోతుల శ్రీకర్రాజు – 806వ ర్యాంకు
- ఇస్లావత్ శ్రీరామ్ హర్ష – 823వ ర్యాంకు
- కట్టా ప్రత్యూష – 908వ ర్యాంకు
- గోగుల రాజశేఖర్ – 920వ ర్యాంకు
- గుగులోతు జితేందర్ నాయక్ – 939వ ర్యాంకు
