>> ఈ సెక్షన్ 301 .. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యూఎస్ ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 కింద.. యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేసియా, ఇండోనేసియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయ్లాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ లిస్టులో కెనడా మాత్రం లేదు.
అసలేంటీ సెక్షన్ 301..
ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి అన్యాయ వాణిజ్య విధానాలను సవాల్ కోసం అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధం సెక్షన్ 301. ఆయాాలు పాటిస్తున్న ట్రేడ్ పాలసీలు.. అమెరికా ప్రయోజనాలు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నాయా.. లాభం చేకూరుస్తున్నాయా అంటే ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. దర్యాప్తులో భాగంగా సాక్ష్యాలు సేకరిస్తుంది.
ఇక్కడ ఏదైనా దేశం అమెరికాకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీని పాటిస్తున్నట్లు తేలితే.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుమతి లేకుండానే ఆ దేశంపై చర్యలు తీసుకునే అధికారం అమెరికాకు ఉంటుంది. ఆ దేశాలపై అప్పుడు చట్టబద్ధంగానే భారీగా సుంకాలు విధించడం ఇతర ప్రతీకార చర్యలు చేపట్టేందుకు అమెరికాకు అధికారం లభిస్తుంది.
అమెరికాకు చైనా ప్రత్యర్థిగా ఉంది సరే.. మరి భారత్ వంటి మిత్ర దేశంపైనా అమెరికా ఇలా సెక్షన్ 301 కింద దర్యాప్తు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. భారత్.. అమెరికా ఉత్పత్తులపై విపరీతంగా సుంకాలు విధిస్తుందని.. అన్యాయ సాంకేతికతను అవలంబిస్తుందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తూ భారత్పై ఒక దశలో దిగుమతి సుంకాల్ని 25 పెంచారు. తర్వాత రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నందున ప్రతీకార పేరుతో మరో 25 శాతం.. 50 శాతం చేర్చారు. ఎ తర్వాత రెండు దేశాల మధ్య చర్చలతో ప్రతీకార సుంకాల్ని తొలగించి.. దిగుమతి సుంకాల్ని మొత్తంగా 18 శాతం చేర్చింది.. ఈ సమయంలో.. ఇప్పుడు ట్రంప్ ఈ సెక్షన్ను తెరపైకి తీసుకొచ్చి మరో చర్చకు తెరతీశారు.
