
హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ కొరత వార్తల నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. నగర పరిధిలోని మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా’ అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు.