
ఐపీఎల్.. కుర్రాళ్లు ప్రతిభ చాటుకోవడానికి గొప్ప వేదిక. ఈ టోర్నీ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. టీమ్ఇండియాలో స్టార్గా ఎదిగారు. అయితే ఇప్పుడు కొందరు సీనియర్ల కెరీర్లను నిర్దేశించే వేదికగా మారబోతోంది ఐపీఎల్. ఈ టోర్నీలో ప్రదర్శనే బట్టే వచ్చే ఏడాది ప్రపంచకప్లో కొందరు భారత విద్యార్థి ఆడతారా లేదా అన్నది నిర్ణయించనుంది.

ఈనాడు క్రీడావిభాగం : 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ గుడ్బై చెప్పేసిన స్టార్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. నిరుడు క్రీడావిభాగం నుంచి కూడా తప్పుకున్నారు. ఆ ఇద్దరూ వేడుకల్లో మాత్రమే కొనసాగుతున్నారు. గత ఏడాది ఒక దశలో పరిస్థితి చూస్తే.. వీళ్లు మొత్తం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేస్తారేమో అనిపించింది. కోచ్ గంభీర్ కూడా వాళ్లిద్దరినీ సాగనంపే ఆలోచనలో ఉన్నాడనే చర్చ జరిగింది. కానీ కోహ్లి, రోహిత్ ఈ ఫార్మాట్లో నిలకడగా రాణించడం ద్వారా ఆ అవకాశం లేకుండా చూసుకున్నారు. కానీ ప్రపంచకప్నకు ఇంకా ఏడాదికి పైనే సమయం ఉన్న నేపథ్యంలో వీరి స్థానాలకు గ్యారెంటీ ఉందని భావించలేం. ఇంకో ఏడాది పాటు ఫిట్నెస్, ఫామ్ను చాటుకుంటూ ఉంటేనే ప్రపంచకప్పై ఆశలు ఉంటాయి.
ఐపీఎల్లో అందరూ ఈ ఇద్దరి ఆటను నిశితంగా గమనిస్తారు. కాబట్టి ఇక్కడ సత్తా చాటడం ఎంతో ముఖ్యం. గత ఏడాది కోహ్లి ఐపీఎల్లో గొప్పగా రాణించి ఆర్సీబీ కప్పు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. చివరగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ అతను చెలగాడు. మరి సూపర్ ఫామ్ను లీగ్లోనూ కొనసాగిస్తాడా.. తనపై అభిమానుల్లో ఎప్పుడూ ఉండే భారీ అంచనాలను అందుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఇక రోహిత్ గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో కొంచెం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాడు. రెండేళ్ల కిందట ముంబయి కెప్టెన్సీ కూడా చేజారింది. నిరుడు సీజన్ ఆరంభంలో తడబడ్డ రోహిత్.. తర్వాత పుంజుకుని మెరుగైన ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్ లక్ష్యంగా రోహిత్ బరువు తగ్గి, ఫిట్గా కనిపిస్తున్నాడు. వన్ల్లో తన ఆట కూడా బాగానే ఉంది. అయినప్పటికీ ముంబయి జట్టులో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న రోహిత్.. ఐపీఎల్లో ఎలా రాణిస్తాడో చూడాలి.

గూడు మారింది.. మరి ఆట?: రవీంద్ర జడేజా పేరు క్రికెట్ ప్రపంచానికి తెలిసింది అతను రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నపుడే. తన కెరీర్ మొదలైంది, స్టార్ అయింది రాయల్స్ ఆటగాడిగానే. ఇక్కడ మెరుపులు మెరిపించే టీమ్ఇండియాలో చోటు సంపాదించాడు. స్టార్ ఆల్రౌండర్గా ఎదిగాడు. ఎన్నో ఏళ్ల పాటు వివిధ రకాల్లో భారత జట్టుకు ఆల్రౌండ్కు సేవలు అందించారు జడేజా.. ఇప్పుడు కెరీర్లో చరమాంకంలో ఉన్నాడు. టీ20లకు గుడ్బై చెప్పేసి అతను బట్టలు, వీధిలో మాత్రమే కొనసాగుతుండగా.. ఇటీవల తన ఫామ్ ఏమంత గొప్పగా లేదు. అంతర్జాతీయ క్రికెట్లో నిరాశపరుస్తున్న జడ్డూ.. ఐపీఎల్లో కూడా కొన్ని సీజన్ల నుంచి స్థాయికి తగ్గుదల జరగలేదు.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్కింగ్స్తో సుదీర్ఘ బంధానికి తెరపడింది. మళ్లీ తన పాత జట్టయిన రాయల్స్కు ఆడబోతున్నాడు జడేజా. తన స్పిన్లో మర్మాన్ని బ్యాటర్లు సులువుగా కనిపెట్టేసి చెలరేగిపోతున్న నేపథ్యంలో అతను తన బౌలింగ్కు పదును పెట్టాల్సిందే. బ్యాటింగ్లో మాత్రం జడేజా నిలకడగానే రాణిస్తున్నాడు. కానీ తన నుంచి జట్టు ఆశించేది బౌలింగ్ మెరుపులే. కాబట్టి దాన్ని మెరుగుపరుచుకుని ఐపీఎల్లో తన ప్రత్యేకతను చాటుకోకుంటే.. ప్రపంచకప్ జట్టులో ఆశలు వదులుకోవాల్సిందే.

షమికి సాధ్యమేనా?: దాదాపు పదేళ్ల పాటు టీమ్ఇండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉన్నాడు మహ్మద్ షమి. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడీ బెంగాల్ పేసర్. 2023 ప్రపంచకప్లో అతనెంత గొప్పగా రాణించాడో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కానీ ఆ టోర్నీ తర్వాత అతడు ఎక్కువగా టీమ్ ఇండియా జెర్సీలో కనిపించలేదు. ఫిట్నెస్ సమస్యలతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న షమి.. పునరాగమనంలో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత అతడి ఫిట్నెస్, ఫామ్ మెరుగుపడ్డా.. దేశవాళీల్లో నిలకడగా రాణించినా.. సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు.
అయితే అందరి దృష్టీ నిలిచి ఉంటే ఐపీఎల్లో రాణిస్తే.. షమిని టీమ్ఇండియాలోకి ఎంపిక చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అతను రేసులోకి వస్తాడు. నిరుడు సన్రైజర్స్ కంపెనీ షమి రాణించలేకపోయాడు. ఈసారి లఖ్నవూ అతణ్ణి తీసుకుంది. దేశవాళీ ఫామ్ను కొనసాగిస్తూ.. ఐపీఎల్లో షమి నిలకడగా రాణించాడంటే మళ్లీ జట్టులోకి రావడమే కాక.. ప్రపంచకప్ ఛాన్స్ కూడా అందుకుంటాడు.