భారతదేశం రిటైల్ ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం: 8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు – భారతదేశంలో ఆహార ధరలను చల్లబరచడం వల్ల సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది.


ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2025: సామాన్యులకు శుభవార్త. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి తగ్గింది. సెప్టెంబర్ నెలలో 1.54 శాతంగా నమోదు కాగా.. ఇది 8 సంవత్సరాల కనిష్టం కావడం విశేషం. చివరిగా 2017 జూన్ నెలలో 1.46 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చింది. ఇటీవల ఆగస్టులో అంతకుముందుతో పోలిస్తే చాలా పెరిగింది. మళ్లీ దిగిరావడం సానుకూలాంశం అని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఫుడ్ ప్రైసెస్ తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొస్తుంది.

రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం(ఫోటోలు– నవభారత్ టైమ్స్)
ఆహార ద్రవ్యోల్బణం: దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం కీలకంగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే. వరకు వరకు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండాలన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే.. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీంతో ఎటుచూసినా మళ్లీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిస్తుంది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలకు సంబంధించి.. ద్రవ్యోల్బణం సంభవించిందని.. జాతీయ వ్యాధి కేంద్రం (NSO) విడుదల చేసింది. ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో.. ఏకంగా 8 సంవత్సరాల కనిష్టానికి పడిపోవడం విశేషం. సెప్టెంబరులో ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైందని నిష్పత్తి. చివరిసారిగా జులైలో కూడా తక్కువగానే నమోదైంది.

>> గత నెలలో అంటే ఆగస్టులో కూడా 2.07 శాతంగా ఉంది. ఇది 2 నెలల స్థాయి. అక్కడి నుంచి విశేషంగా తగ్గి.. సామాన్యులకు ఊరట కల్పించిందని చెప్పొచ్చు. గత కొంత కాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గితే.. వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే.. వస్తువుల ధరలు తగ్గితే కూడా ద్రవ్యోల్బణం దిగొస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో.. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం భారీగా తగ్గిందని ఎన్ఎస్ఓ విడుదల చేసింది.

ఇప్పుడు ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన పరిమితి కంటే చాలా తక్కువగా నమోదు కావడం మరో విశేషం. ఆర్బీఐ 4 ప్లస్ లేదా మైనస్ 2 గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 2-6 శాతం మధ్య ఉండొచ్చన్నమాట. కానీ ఇప్పుడు ఆర్బీఐ టార్గెట్ అయిన 2 కంటే తక్కువ స్థాయి చేరడం గొప్ప విషయం.
ధరల సూచీలో దాదాపు సగం వాటా ఉండే ఆహార ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్‌ప్లేషన్) గత నెలలో – 0.69 శాతంగా ఉండగా.. ఇప్పుడు – 2.28 శాతం తగ్గింది. ఇంకా కూరగాయలు, పప్పు ధాన్యాలు గుడ్లు, నూనెలు, తృణ ధాన్యాలు, ఇంధన ధరలు, పండ్లు తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొచ్చిందని ఎన్ఎస్ఓ ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 1.07 శాతంగా ఉండగా.. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా 2.04 శాతంగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో ద్రవ్యోల్బణం 9.05 శాతంగా ఉండగా.. ఇది ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 0.61 శాతంగా ఉండటం విశేషం. ఇక ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణం లెక్కల్ని తీసుకుంటే కీలక రెపో రేట్లను తగ్గిస్తుందని చెప్పొచ్చు. కిందటి సమీక్షలో వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచబడ్డాయి.. ఈసారి డిసెంబరులో మళ్లీ తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పూర్ణచందర్ తూనం

రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బిజినెస్‌ రంగానికి సంబంధించిన తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ న్యూస్, బంగారం వెండి ధరలపై తాజా అప్‌డేట్లు అందజేస్తాయి. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ భారత్ సంస్థలో బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. పూర్ణచందర్ ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. పూర్ణచందర్ 2025 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఏబీసీడీ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి