మహిళల ప్రపంచకప్ గెలుపుపై మోదీ (ANI)
మహిళల ప్రపంచకప్ విజయంపై మోదీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం దేశంలో కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యావత్ దేశం మన టీమ్ను చూసి గర్విస్తోందన్నారు. ఈ సదస్సు సైన్స్ది అయినప్పటికీ, తాను మొదట భారత మహిళల క్రికెట్ జట్టు విజయం గురించి మాట్లాడుతానని ప్రధాని అన్నారు. తొలి మహిళా ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకోవడాన్ని గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. సోమవారం న్యూఢిల్లీలో ‘ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్వేషన్ కన్క్లేవ్’ (ఈఎస్టీఐసీ) సదస్సు వేదికగా ప్రధానమంత్రి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన విజయాల వివరాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ను ఆయన ఆవిష్కరించారు. ఈ రంగంలో పురోగతిపై భారత ప్రభుత్వం రూపొందించిన 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రధాని విడుదల చేశారు.
రూ.1 లక్ష కోట్లతో ‘ఆర్డీఐ ఫండ్’
రూ.1 లక్షలతో ‘రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్’ (ఆర్డీఐ) ఫండ్ను ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన. దేశంలోని ప్రైవేటు రంగం పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. ఎక్కువ రిస్క్తో కూడిన, ఎక్కువ ప్రభావవంతమైన పరిశోధనల కోసం ఈ నిధిని కేటాయిస్తుంది. ఆర్డీఐ ఫండ్కు నోడల్ శాఖగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పనిచేస్తుందని చెప్పారు. యూనివర్సిటీల్లో పరిశోధనలతో పాటు విభిన్న భరిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ‘అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసిందని ప్రధాని తెలిపారు. సైన్స్ కొత్త స్థాయిలను అందుకున్నప్పుడు, ఆవిష్కరణలు వైవిధ్యంగా ఉన్నప్పుడు, టెక్నాలజీ కొత్తరూపును సంతరించుకున్నప్పుడు గొప్ప విజయాలకు పునాదులు పడతాయి. అంతర్జాతీయ ఏఐ ఫ్రేమ్వర్క్ రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మానవీకృత ఏఐ టెక్నాలజీ అనే భారత్ ప్రధాన ఫోకస్ ఉంటుందా. మన దేశం కేవలం టెక్నాలజీ వినియోగదారుల కాదని, టెక్నాలజీకి కొత్త రూపు ఇచ్చే నెలవుగా భారత్ మారుతోందని పేర్కొన్నారు. ప్రపంచ క్రమం కొత్త మలుపులు తీసుకుంటోందని, చాలావేగంగా ప్రపంచం మారుతోందని ప్రధాని అన్నారు.
#చూడండి | ఢిల్లీ: ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ (ESTIC) 2025లో, PM నరేంద్ర మోడీ ఇలా అన్నారు, “ఈ రోజు, AI (కృత్రిమ మేధస్సు) ప్రతిచోటా ఉపయోగించబడుతోంది, రిటైల్ నుండి లాజిస్టిక్స్ వరకు, కస్టమర్ సర్వీస్ నుండి పిల్లల హోమ్వర్క్ వరకు. కాబట్టి, భారతదేశంలో కూడా మనం… pic.twitter.com/JB5zvRsHae
– ANI (@ANI) నవంబర్ 3, 2025
గత పదేళ్లలో ఆర్అండ్డీ వ్యయాలు డబుల్
”గత కొన్నేళ్ల మా పాలన వల్లే భారత్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. గత పదేళ్లలో మన దేశంలోని వివిధ రంగాల కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) వ్యయాలు రెట్టింపు అయ్యాయి. దేశంలో రిజిస్టర్ అయ్యే పేటెంట్ల సంఖ్య దాదాపు 17 రెట్లు పెరిగింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించింది. స్వచ్ఛ ఇంధనం, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి కీలకమైన టెక్ విభాగాల్లో 6వేలకుపైగా డీప్టెక్ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. భారత్లోని సెమీకండక్టర్ రంగం రెక్కలు తొడిగింది” అని ప్రధాని మోదీ అన్నారు.
#చూడండి | న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ (ESTIC) 2025లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ESTIC 2025 3-5 నవంబర్ 2025 వరకు నిర్వహించబడుతుంది. ఈ కాన్క్లేవ్ అకాడెమియా నుండి 3,000 మందికి పైగా పాల్గొనేవారిని తీసుకువస్తుంది,… pic.twitter.com/tovgdp8XPB
– ANI (@ANI) నవంబర్ 3, 2025
సంక్షోభ కాలంలోనూ భారత్ సత్తాను చాటుకుంది
”కరోనా సంక్షోభ కాలంలోనూ భారత్ సత్తాను చాటుకుంది. భారత మార్కెట్ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన ఫార్మా ఆక్సిడెంట్ వ్యాక్సిన్ చాలా తక్కువ సమయాల్లోనే తయారు చేసి యావత్ ప్రపంచ దేశాలకు సప్లై చేశాయి. అత్యంత విజయవంతమైన ప్రపంచంలోనే తొలి డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతుల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఇకపై మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలతో భారత్ మున్ముందుకు సాగుతుంది” అని ప్రధాని మోదీ ప్రకటించారు.