దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో మన ఇండియా పాత్ర చాలా కీలకం. సుమారు 3 బిలియన్ డాలర్లకు ఇండియా ఆఫ్గనిస్తాన్కు సహాయం చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం, ఇతర నిర్మాణాలు, కీలక ప్రాజెక్టులను నిర్మించడంలో ఇండియాదే కీలక పాత్ర. ముఖ్యంగా పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది ఇండియా. ఈ కారణాల నేపథ్యంలో అక్కడ తాలిబన్ ప్రభుత్వం కనిపిస్తుంది, మన భారతీయులకు చాలా గౌరవం ఇస్తారు.
చాలా హోటల్స్ లో ఉచితంగానే ఇండియన్స్ కు భోజనం కూడా పెడుతున్నారట. యూట్యూబర్లు అక్కడికి వెళ్తే, ఫుల్ సపోర్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ నిలుస్తోంది. అయితే తాజాగా ఆఫ్గనిస్తాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఇండియాకు సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని, వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసింది. కంపెనీలు పెట్టుకోవడానికి ఉచితంగా భూములు కూడా ఇవ్వడానికి. ఆ భూముల్లో కంపెనీలు పెట్టి, తమ ఆర్థిక వృద్ధికి సహాయం చేయడానికి ఇండియాను కోరుతోందట ఆఫ్ఘనిస్తాన్. ఉచితంగా భూములు కాకుండా, సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.