AP News Updates: భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం | జాతీయం-అంతర్జాతీయం


ఆంధ్రప్రదేశ్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ విమానంలో ఎయిర్ పోర్టుకి వచ్చారు. ఇది టెస్ట్ ఫ్లైట్ మాత్రమే. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్ పోర్టును నిర్మించారు. దీన్ని జూన్ నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది.

భోగాపురానికి నేడు మొదటి విమానం వస్తుంది. అందులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తారు. నేడు తెలంగాణ భవన్‌లో పాలమూరు, కృష్ణా జలాలపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండొచ్చు. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్.. తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో మధ్యాహ్నం 3కి ఉంటుంది. వారణాసిలో 72వ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్‌ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. నేడు ప్రపంచ బెయిలీ లిపి దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. నిమిషం టు నిమిషం చూద్దాం.



Source link

Spread the love