70 ఎకరాల్లో ఏర్పాటుకు ఒప్పందం

సిఆర్డీఏ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్న బిట్స్ పిలానీ ప్రతినిధులు
తుళ్లూరు, న్యూస్టుడే: ప్రజా రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ యూనివర్సిటీ బిర్లా ఇన్- ప్రముఖ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) త్వరలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధి 70.01 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు శుక్రవారం సీఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మందడం సబ్ రిజిస్ట్రార్ రాంబాబు సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జైంట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ సంస్థ అధీకృత ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్.మూర్తి ఉన్నారు.
మొదటి దశలోనే రూ.వెయ్యి పెట్టుబడి
అమరావతి క్యాంపస్ పనులను 3 దశల్లో చేపట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొదటి కోట్ల రూ.1000 ఆధునిక స్మార్ట్ఫోన్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, బోధనా సాంకేతికతకు అవసరమైన పర్యావరణహిత నిర్మాణాలతో క్యాంపస్ను కొత్తతరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2027 నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేలా పనులు వేగంగా పూర్తి చేయగలిగారు. దశల వారిగా 10 వేల మంది అభ్యసించేలా క్యాంపస్ను తీర్చిదిద్దుతామన్నారు.