ఇవాళ ఏమున్నాయి?
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలై 7 రోజులు పూర్తైంది. ఇవాళ 8వ రోజు కొనసాగుతోంది. నేడు JNTUలో తెలంగాణ పోలీస్ ఉమెన్ సేప్టీ వింగ్ అధ్వర్యంలో స్టాండ్ విత్ హెర్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హాజరవుతారు. ఉదయం 11.01కి ధురంధర్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ అవుతుంది. 19న సినిమా రిలీజ్ ఉంది. నేడు డార్జిలింగ్కి వెళ్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడ 9వ ఇంటర్నేషనల్ సంతాల్ కాన్ఫరెన్స్కి హాజరవుతారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. నేడు రంగుల పంచమి. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.