ఇవాళ ఏమున్నాయి?
కాకినాడలో బాణసంచా పేలుడు విషాదం అందర్నీ కలచివేసింది. ఇరాన్-అమెరికా యుద్ధం అంతకంతకూ తీవ్రమై.. గల్ఫ్ అంతటా విస్తరిస్తోంది. ఇవాళ్టి నుంచి సిమ్ లేకుండా వాట్సాప్ని వాడలేరు. నేటి నుంచి అందుబాటులోకి ‘RailOne’ యాప్ వచ్చింది. ఇవాళ అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి CJI జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేస్తారు. నేడు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అవుతారు. T20 ప్రపంచ కప్లో నేడు జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్.. మధ్యాహ్నం 3కి ఉంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్.. రాత్రి 7కి ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.