జంతికలు, మురుకులు, సకినాలతో పల్లెల నుంచి సిటీలకు పయనాలు మొదలయ్యాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మళ్లీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. నేడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి. ఏపీలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేడు బెంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. పనిలో పనిగా 4 అమృత భారత్ రైళ్లు కూడా ప్రారంభిస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లా.. పాలేరుకి సీఎం రేవంత్ వెళ్లి.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత మేడారంకి వెళ్లి.. సాయంత్రం కేబినెట్ సమావేశం అక్కడే పెడతారు. నేడు ఆదిలాబాద్ జిల్లా.. కేస్లాపూర్లో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నేడు స్విట్జర్లాండ్.. దావోస్కి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. నేడు ఖమ్మంలో సీపీఐ భారీ బహిరంగ సభ ఉంది. గోల్కొండ, పరేడ్ గ్రౌండ్లో నేడు చివరి రోజుగా హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంది. 18 నుంచి 31 వరకూ ఢిల్లీ లోని దిల్లీ హాత్ దగ్గర.. పీఎం విశ్వకర్మ హాత్ మేళా జరుగుతుంది. నేడు మౌనీ అమావాస్య. నేడు ఇండియా, న్యూజిలాండ్ మూడో, చివరి వన్డే ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.