
దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రృతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉప ఎన్నికల స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు పుదుచ్చేరి స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నియమితులయ్యారు.