ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బిర్లా ఇన్ కొత్త ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) క్యాంపస్ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణానికి వీలుగా ఇవాళ సీఆర్డీఏయే కీలక ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియ, ఇతర వివరాలపై ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది.
అమరావతిలో బిట్స్ క్యాంపస్ (BITS pilani)
అమరావతిని ఉన్నత విద్యా కేంద్రంగా మార్చేందుకు ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్పుష్ట్ ఆఫ్ టెక్నాలజీ (BITS pilani) అమరావతిలో 70.011 ఎకరాల్లో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుందని సీఆర్డీఏ సైన్స్. తుళ్లూరు వారి మందడం, వెంకటపాలెంలో ఈ మేరకు బిట్స్ సంస్దకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు సీఆర్డీయేతో ఇవాళ బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

మూడు దశల్లో నిర్మాణం
బిట్స్ క్యామ్ అమరావతింపస్ను మూడు దశలుగా అభివృద్ధి చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొదటి దశలోనే సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధనా పద్ధతులు, పర్యావరణహిత నిర్మాణాలతో ఈ క్యాంపస్ను కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

2027 నుంచే అడ్మిషన్లు
2027 నుంచి అమరావతి క్యాంపస్లో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. దశలవారీగా పదివేల మంది విద్యార్థులు అమరావతి బిట్స్ క్యాంపస్లో విద్యను అభ్యసించేలా ప్రణాళికాయుతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ రాకతో వందలాది అధ్యాపకులు, సిబ్బంది, సాంకేతిక & అనుబంధ రంగాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే స్థానిక యువతకు అవకాశాలు పెరగడం, రాజధానిలో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి అవకాశాలు విరివిగా ఉన్నాయి.