
మన దీర్ఘకాల వృద్ధి, స్థిరత్వంతో పాటు విదేశాల్లో కీలకమైన ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (ఐడీఎస్ఎఫ్)ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐఐ) కోరింది. వృద్ధికి అవసరమైన రుణాలు ఇవ్వడానికి, దేశ వ్యూహాత్మక భవిష్యత్తుకు ఐడీఎస్ఎఫ్ దోహదపడుతుందని. జాతీయ నిధిగా ఏర్పాటయ్యే ఐడీఎస్ఎఫ్తో దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచేందుకు మూలధనాన్ని సమీకరించొచ్చని. సరైన ప్రణాళికతో వచ్చే రెండు దశాబ్దాల్లో ఐడీఎఫ్ఎస్ భారీ నిధి అవుతుందని సీఐఐ విశ్వసిస్తోంది. 2047 నాటికి 1.3- 2.6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.115-230 లక్షల కోట్లు) శ్రేణిలో ఈ నిధి ఉంటుందని.. ప్రపంచస్థాయి సార్వభౌమ పెట్టుబడిదారులకు ఇచ్చే రుణాలకు ఇది సమానమని.
నిధుల సమీకరణ ఇలా
ప్రతిపాదిత నిధిపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సాధించేందుకు ప్రారంభ దశలో స్వల్ప బడ్జెట్ కేటాయింపు జరపాల్సి ఉంటుంది. అనంతరం ప్రచురణ, ట్రాన్స్మిషన్ లైన్లు, పోర్టులు, స్పెక్ట్రమ్ జాతీయ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మేరకు ఈ నిధులను క్రమపద్ధతిలో మళ్లించవచ్చు.
- భవిష్యత్తులో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంత ప్రభుత్వ వాటాను ఈ నిధులకు బదిలీ చేయొచ్చు. ఈ సంస్థలను కేవలం పెట్టుబడుల ఉపసంహరణ కోసం మాత్రమే చూడకుండా, అంతర్జాతీయ విస్తరణకు సాధనంగా మార్చుకోమని నివేదిక సూచించింది.
- దీర్ఘకాలంలో దేశీయంగా, అంతర్జాతీయంగా నిధులను సమీకరించడానికి ప్రాథమిక, హరిత, డయస్పోరా బ్యాండ్లు సహా థీమ్యాటిక్ సాధనాలను ఈ ఫండ్ జారీ చేయొచ్చు. బహుళపాక్షికం, ద్వైపాక్షికొచ్చు వాణిజ్యంతో కలిసి పెట్టుబడులు పెట్టండి.
- సరిపడా నిల్వలను సాధించాక.. మన విదేశీ మారకపు నిల్వల్లో కొంత కీలకమైన నిల్వలు, ఇంధనం వంటి రంగాల్లో విదేశీ వ్యూహాత్మక కొనుగోళ్లకు వినియోగించొచ్చు.
- భారత అభివృద్ధి కోసం శాశ్వత ప్రాతిపదికన సొంత ఆర్థిక నిధిని ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నామని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇటువంటి దీర్ఘకాలిక మూలధన లక్ష్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు.