
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ.. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన కీలక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగోవంతుకు సమానమైన ఈ ‘మదర్ ఆఫ్ ఆల్’ డీల్ ముఖ్యంగా అమెరికాకు కంగారు తెప్పిస్తోంది. మరి ఈ ఒప్పందం ఎందుకంత ముఖ్యం..?ట్రాంప్ టారిఫ్లకు ఇది పగ్గాలేస్తుందా?
దశాబ్దాల చర్చలు ఫలించి..
భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) 2007లోనే చర్చలు మొదలయ్యాయి. అయితే, ఆటోమొబైల్స్, వైన్పై దిగుమతి సుంకాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం కుదర చిత్రం మధ్యలో నిలిచిపోయిన చర్చలు 2022లో తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఈ ఎఫ్టీఏ కోసం వేగంగా అడుగులు పడ్డాయి. ఈ ఒప్పందంతో దాదాపు 90 శాతం భారత సమాచారం ఐరోపా మార్కెట్లో సుంకాలు ఉండవని. ముఖ్యంగా జౌళి, లెదర్, కెమికల్స్, ఆభరణాల రంగాలకు ఈ డీల్ ఊతమివ్వనుంది. భారత్కు ఐరోపా సమాఖ్య అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023-24లో ఈ వాటి మధ్య దాదాపు 135 బిలియన్ల డాలర్ వర్తకం జరిగింది. ఈ రెండు పక్షాల మధ్య ఎఫ్టీఏ- దాదాపు 200 కోట్ల మందికి ఉమ్మడి మార్కెట్ను సృష్టిస్తుంది.
ట్రంప్ టారిఫ్లకు కౌంటర్..
ఇక, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో భారత్- ఈయూ ట్రేడ్ డీల్ను ట్రంప్ టారిఫ్లకు వ్యూహాత్మక కౌంటర్గా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులో భారత్పై ట్రంప్ 25 శాతం టారిఫ్లు విధించారు. ఇక, రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా అదనపు పెనాల్టీలు వేయడంతో సుంకాల మొత్తం 50శాతానికి చేరింది. అటు ఈయూ విషయానికొస్తే.. ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్లు వేశారు. ఆ తర్వాత ఆ సుంకాలను 15 అక్షరాలు తగ్గిస్తూ అమెరికా, ఈయూ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ను ఆమోదించింది.
ఇదిలాఉండగా.. ఇటీవల గ్రీన్ల్యాండ్ వ్యవహారంలో ఐరోపా సమాఖ్యతో ట్రంప్ సంబంధాలు బెడిసికొట్టాయి. గ్రీన్లాండ్కు సహకరించే ఐరోపా దేశాలపై టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలపై ఈయూ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ పరిణామాల వేళ భారత్తో ఒప్పందం చేసుకునేందుకు ఐరోపా సమాఖ్య వేగిరపడింది.
డీల్కు తప్పని సవాళ్లు..
భారత్-ఈయూ మధ్య ఈ ఒప్పందం అధికారికంగా కుదిరినప్పటికీ తక్షణం అమలు చేయడం సాధ్యం కాదు. ట్రేడ్ డీకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకునేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే.. డీల్ కుదిరినా.. ఆ మేరకు ఉపశమనం లభించాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. మరోవైపు, ఐరోపా దేశాల్లో ఉన్న రెగ్యులేటరీ నిబంధనలు కూడా ఈ ఒప్పందంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఈయూ గత కొన్ని దశాబ్దాలుగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.
ఇక, ఈ ఏడాది జనవరి నుంచి కార్బన్ ట్యాక్స్ను తీసుకొచ్చింది. ఈ తరహా పన్ను వసూలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. సిమెంట్, స్టీల్, అల్యూమినియం, ఆయిల్ రిఫైనరీ, పేపర్, గ్లాస్ వంటి వస్తువులు దిగుమతులపై ఈ పన్ను వర్తించనుంది. ఈయూ భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో అత్యధిక అల్యూమినియం, ఇనుము, ఉక్కే ఉండటం. ఇక, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు, బోర్డు సుస్థిరత కోసం కూడా ఈయూ రూల్స్ని రూపొందించింది. అన్ని తాజా ఒప్పందంపై ఏమేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది..!