Mana Shankara Varaprasad Garu Ticket Price Hike,Chiranjeevi Movie: చిరంజీవి సినిమాకి ఏపీలో టికెట్‌ ధరల పెంపు.. శంకర వరప్రసాద్‌ గారికి తెలంగాణలో రేట్లు కష్టమేనా? – ap govt permission to chiranjeevi mana shankara varaprasad garu ticket price hike


Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షోలకు రూ.500.. ఆ తర్వాత పది రోజులు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడంతో, ఇక్కడ రేట్లు పెంచడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారికి ఏపీ ప్రభుత్వ అనుమతి టికెట్ ధర పెంపు
చిరంజీవి సినిమాకి ఏపీలో టికెట్‌ ధరల పెంపు.. శంకర వరప్రసాద్‌ గారికి తెలంగాణలో రేట్లు కష్టమేనా?(ఫోటోలు– Samayam Telugu)
చిరంజీవి హీరోగా నటించిన యాక్షన్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. ‘పండగకి వస్తున్నాం’ అనేది దీనికి ట్యాగ్ లైన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా స్పెషల్‌ ప్రీమియర్‌తో పాటు, టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. జనవరి 11న ప్రీమియర్‌ షోలు వేసుకోడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్లకు జీఎస్టీతో కలిపి టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్‌ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకోడానికి పర్మిషన్స్ ఇచ్చింది.

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ మూవీకి ఏపీలో టికెట్ రేట్స్ హైక్ లభించినప్పటికీ, తెలంగాణాలో కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ది రాజాసాబ్’ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాకి ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాజశేఖర్. జి

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు, సినిమా రివ్యూలు రాశారు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. రాజశేఖర్ జేఎన్‌టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి