Modi On Congress Shirtless Protest,”మీరు కొత్తగా బట్టలు విప్పాల్సిన పనిలేదు”.. కాంగ్రెస్ షర్ట్ లెస్ నిరసనపై మోదీ తీవ్ర విమర్శలు – pm narendra modi fires on congress over shirt less protest at india ai impact summit


యూత్ కాంగ్రెస్ నిరసనపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరనస తీవ్ర విమర్శలకు దారితీసింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచస్థాయి ఏఐ సమ్మిట్‌లో షర్టులు విప్పి ఆందోళనకు దిగారు. ట్రంప్ షరతులకు మోదీ ప్రభుత్వం తలొగ్గిందని వారు అనుకూలంగా ఉన్నారు. ఈ డీల్ వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది.

హైలైట్:

  • ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ నిరసన
  • ప్రతిపక్ష పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
  • కాంగ్రెస్ ఎప్పుడో దిగజారిపోయిందని విమర్శలు
ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ(ఫోటోలు– సమయం తెలుగు)
న్యూఢిల్లీలో జరిగింది ఇండియా ఐఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లోని యువజన కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చి.. అర్ధనగ్నంగా చేపట్టిన నిరసనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. యూత్ కాంగ్రెస్ నిరసనలను ఖండించి మోదీ.. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ సైద్ధాంతికంగా దిగజారిపోయిందని ఈ ఘటన స్పష్టం చేస్తోందని మోదీ దుయ్యబట్టారు. మీరట్‌ మెట్రో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ”అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలని ప్రజలు కష్టపడుతుంటే.. ప్రగతిని కొన్ని పార్టీలు ఓర్వలేకపోతున్నాయి. ప్రపంచంలోనే భారీ ఏఐ సదస్సును నిర్వహించడం దేశంలో ప్రతి ఒక్కరికీ గర్వకారణం. కానీ ఈ అంతర్జాతీయ వేదికను తన నీచ, నగ్న రాజకీయాలకు కాంగ్రెస్ వాడుకుంది” అని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు నగ్నంగా నిలబడి నిరసన తెలిపారు. అసలు మీ నిజస్వరూపం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు.., మళ్లీ కొత్తగా మీరు బట్టలు విప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ” అని ప్రధాని ధ్వజమెత్తారు. దేశం పరువు తీయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని మోదీ పథకం. తనకు వ్యతిరేకంగా తన సమాధిని తవ్వాలని చూస్తున్నారని, తన కన్నతల్లిని దూషిస్తున్నారని. కానీ, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన వేదిక వద్ద ఇలా ప్రవర్తించడం హద్దులు మీరనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం పరువు తీసిన వాళ్లను మందలించాల్సింది పోయి.. నిరసనకారులను కాంగ్రెస్ నాయకులు ప్రశంసించడం దురదృష్టకరమని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనను విమర్శించిన ఇండియా కూటమిలోని పార్టీలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఇక, ఐఐ సమ్మిట్‌లోకి జరిగే భారత మండపం వద్దకు ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్న టీ-షర్టులను ధరించి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ.. ట్రంప్‌కి మోదీ భయపడ్డారని. అడ్డుకోడానికి అక్కడ భద్రతా సిబ్బంది ప్రయత్నించారు.. వారితో కాంగ్రెస్ యువజన నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కృష్ణ హరి, బిహార్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, జాతీయ సమన్వకర్త నరసింహ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇండియా కూటమి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇది సరైన చర్య కాదని , దేశానికే అవమానమని ఆయన అన్నారు.
అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్య వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి