
హైదరాబాద్: తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.685 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైంది. క్యూర్ పరిధి బయటి ఈ పట్టణాలు, నగరాల్లో 2024-25తో పోలిస్తే రూ.68 కోట్లమేర ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఆస్తిపన్ను ఆదాయం పెరిగింది. కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండలో తగ్గింది. హుజురాబాద్, జమ్మికుంటలో 100 శాతం ఆస్తిపన్ను వసూలైంది.