Revanth Reddy: ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ: సీఎం రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈగల్‌, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. మరోవైపు పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.



Source link

Spread the love