Telangana | ఒంటిపై డీజిల్ పోసుకొని..
తెలంగాణ | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇద్దరు పిల్లలతో కలిసి.. ఒంటిపై డీజిల్ పోసుకొని మహిళ నిప్పంటించుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శిరీష అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు అంటించుకున్నది. తల్లి, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.