తెలంగాణ ఉద్యాన శాఖలో గత ఐదేళ్లుగా అన్యాయానికి గురైన 175 మంది ఉద్యాన విస్తరణాధికారులను (HEO) తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. 2020లో క్యాన్సర్ సాకుతో గత ప్రభుత్వం వీరిని తొలగించింది.. అప్పటి నుంచి వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను తిరిగి నియమించడం పట్ల అధికారుల సంఘం నాయకులు విశ్వనాథ రెడ్డి, సంధ్యా జోషి కృతజ్ఞతలు తెలిపారు.
పోరాటానికి దక్కిన గుర్తింపు..
తమకు ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు ఉద్యాన విస్తరణాధికారుల సంఘం ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో ప్లానింగ్ కమీషన్ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసిన సంఘం నాయకులు విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ సంధ్యా జోషి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. 175 కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రకటించారు.ఈ అధికారులు ఇకపై క్షేత్రస్థాయిలో రైతులకు. ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యాన శాఖ అమలు చేసే ప్రతి నిధి రైతుల చెంతకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం ఇతర ఒప్పంద ఉద్యోగుల్లో కూడా ఆశలు చిగురింపజేసింది. బండి వేణు కుమార్, సాయిదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఉద్యాన ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో రైతులకు కొత్త టెక్నాలజీలు, ఆధునిక సాగు సాంకేతికతను వివరించారు.. ఉద్యాన పంటల (పండ్లు, కూరగాయలు, పూలు) ఉత్పాదకతను పెంచే కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వీరు పంటల నిర్వహణ, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేస్తారు. ఈ అధికారులు పరిశోధనా సంస్థలకు, రైతులకు మధ్య వారధిగా పనిచేస్తూ.. ఉద్యాన రంగ అభివృద్ధికి దోహదపడతారు.